Guppedantha Manasu Serial Today Episode : June 26th వసుధారకు షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన రంగా…. కాలేజీ బాధ్యతలను ఇక ప్రభుత్వానికే అప్పగించడం.

Guppedantha Manasu Serial Today Episode: June 26th ఈ రోజు ఎపిసోడ్ లో ఏంజెల్ చేసిన అవమానంతో శైలేంద్ర రగిలిపోతుంటాడు. . తన బెల్టుతో తానే తెగ కొట్టుకుంటూ ఉంటాడు . మరోవైపు వసుధారకు ఊహించని విధంగా షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన రంగా. ఇలా నేటి ఎపిసోడ్‌లో గుప్పెడంత మనసు సీరియల్…

Guppedantha Manasu Serial Today Episode: నేటి ఎపిసోడ్‌లో వసుధారా సరోజతో రంగానే రిషి సార్ అని 15 రోజుల్లో నిరూపిస్తానని, తన నోటితోనే తన రంగా కాదని, నేనే తన భార్యను అని అందరితో చెప్పేలా చేస్తాను. అప్పుడు నీకు అర్థం అవుతుంది నేను చెప్పేది. ఇంకో 15 రోజుల్లో నువ్వు నీ బావ అనుకుంటున్న నా రిషి సార్‌తో ఇక్కడి నుండి వెళ్లిపోతాను. చూస్తూ ఉండు అని వసుధార ఛాలెంజ్ చేసి అక్కడి నుండి వెళ్లిపోతుంది.

ఇది ఎవరు అసలు. ఇంత ధైర్యంగా మాట్లాడుతుంది. అమ్మో చాలా జాగ్రత్తగా ఉండాలి అని సరోజ అనుకుంటుంది. మరోవైపు తన గదిలో ఏంజెల్ అన్న మాటలకు కోపంగా తనను తానే బెల్టుతో కొట్టుకుంటాడు శైలేంద్ర. ఎవరికీ నువ్వంటే లెక్కలేదు. మను వాళ్ల హార్ట్ బ్రేక్ అయ్యేలా ప్లాన్ చేయాలి.అసలు నేనేంటో అందరికీ చూపించాలి అని అనుకుంటూ శైలేంద్ర తన బెల్ట్ తో తెగ కొట్టుకుంటాడు. ఇంతలో ధరణి వచ్చి ఆపుతుంది. ఎందుకండి ఇలా కొట్టుకుంటున్నారు, దేనికి ఈ Prestretion అని అడుగుతుంది.

ఎండీ సీటు. అది నాకు దక్కకుండా పోతుందనిపిస్తుంది. వసుధార ఉన్నన్నాళ్లు నాకు అడ్డు పడింది. ఇప్పుడు వసుధారా అందనంతా దూరం పోయిన కూడా ఆ సీటు నాకు దక్కడం లేదు. అని శైలేంద్ర ధరణి ముందు నోరుజారుతాడు. ఏమన్నారండి . అందనంతా దూరం పోయిందా అని ధరణి అనుమానంగా అడుగుతుంది. అదే రిజైన్ చేసి ఎవరికీ కనిపించకుండా దూరంగా పోయింది కదా. అందుకే అలా అన్నాను. నేను ఎండీ అవ్వలేకపోతున్నాను. అందుకే ఫ్రస్టేషన్ తట్టుకోలేక ఇలా చేస్తున్నాను అని మళ్లీ కొట్టుకుంటాడు శైలేంద్ర.

ఎండీ అవ్వాలి. ఆ సీటులో కూర్చోవాలి అంటూ తెగ కొట్టుకుంటాడు శైలేంద్ర. దాంతో అది జరగదు లెండి. కొట్టుకోవడం అయిపోయాక చెప్పండి వెన్న పూస్తాను అని ధరణి వెళ్లిపోతుంది. ఇదేంటీ ఆపకుండా వెళ్లిపోయింది. ఎవరికీ కావాలి వెన్న అని శైలేంద్ర మనసులో అనుకుంటాడు. అక్కడ మనో ఫోన్ చూస్తూ ఉంటాడు. దానికి ఏంజెల్ ఏంటో బాగా బిజీ ఉన్నట్లు ఉంటావేంటి బావ . ఎదురుగా మనుషులు ఉన్నారు. వారితో మాట్లాడుదాం అని లేదు . బావ నిన్ను ఒకటి అడిగుతాను నిజం చెబుతావా అని ఏంజెల్ అంటుంది.

ఏంటీ చెప్పు అని మనో అంటే.. నువ్వు ఎవరినైనా ప్రేమించావా అని ఏంజెల్ అడుగుతుంది. దానికి మనో ప్రేమించాను. మా అమ్మను అని మను చెబుతాడు. ఇంతకుముందు కూడా ఇలాగే చెప్పావ్. అందరూ అమ్మను ప్రేమిస్తారు. ఎవరైనా అమ్మాయిని ప్రేమించావా అని ఏంజెల్ అడుగుతుంది. నాకు ప్రేమించేంత టైం లేదు,అంతకన్నా ముందు నాకు చాల పనులున్నాయి. అని మను అంటే.. హా మరి అందరికీ ఉండవ్ మరి పనులు ని ఒక్కడికే ఉంటాయి. అలా అని అందరు ప్రేమించడం లేదా, పెళ్లి చేసుకోవడమ్ లెదా వాళ్లంతా కుటుంబాలతో ఉండట్లేదా మరి అని ఏంజెల్ అంటుంది.

అందరికీ లక్ష్యాలు ఉంటాయి. కానీ, నా లక్ష్యం వేరు అని మను అంటే.. మీ నాన్న ఎవరో తెలుసుకోవడమే కదా. నువ్వు ఇలా ఉంటే ఆయన్ను తెలుసుకోలేవు. ముందు మీ నాన్నను ప్రేమించు. ఆయనను నిలదీద్దామని ద్వేషం పెంచుకుంటున్నావ్. అలా కాకుండా మీ నాన్నని ప్రేమించు. ఆ ప్రేమే నీ దగ్గరికి తీసుకొస్తుంది అని ఏంజెల్ అంటుంది. అందరూ సలహాలు ఇచ్చేవాళ్లే. కానీ నా బాధ ఎవరు అర్థం చేసుకోలేకపోతున్నారు.అని మనో ఏంజెల్ తో నీకు ఆ శైలేంద్రకు మద్య ఎం తేడా లేదు అని చెబుతాడు.

వాడు అలాగే నేను అనామకున్ని అంటాడు. నువ్ అర్థం చేసుకుంది. వాడు అర్థం చేసుకుంది వేరు. నా బాధ గురించి ఎవరికీ అర్ధం కాదు అని కోపంతో వెళ్లిపోతాడు మనో . కట్ చేస్తే రంగా, వసు వాళ్లంతా భోజనం చేస్తుంటారు. సరోజ వచ్చి చేపల పులుసు తీసుకొస్తుంది. అక్కడేమో వసుధార చేసిన చారు తినమని ,సరోజ ఏమో తాను తెచ్చిన చేపల పలుసు తినమని రంగా కు వడ్డించడానికి చిన్నిపాటి గొడవ పడతారు. దానికి రాధమ్మ ముందు చారు తిని తర్వాత చేపల పులుసు తింటాడు లేవే అని చెబుతుంది.

రిషి సార్ ఈ టేస్ట్ మీకు కచ్చితంగా నచ్చుతుంది అని వసుధార మనసులో అనుకుంటుంది. చారుతో అన్నం తింటున్న రంగా నానమ్మ ఈ చారు నువ్వు చేయలేదు కదా … దానికి వాళ్ళ నానమ్మ కాదురా ఆ అమ్మాయే చేసింది అని చెబుతూ .. ఇవాళ వంట అంతా తనే చేసిందని చెప్తుంది . నేను వద్దన్నా పట్టు బట్టి చేసింది. ఈరోజు వంటంతా తనే చేసింది. ఏ నాన్న బాలేదా అని రాధమ్మ అడుగుతుంది. దానికి రంగా చారు ఇలాగ చేస్తే నాకు నచ్చదని నీకు తెలుసు కదా నానమ్మ అని అంటాడు. అప్పుడు వసుధారతో నీకు అసలు బుద్ది ఉందా చారులో అంతలా ఉప్పు వేస్తారా అని సరోజా అంటుంది.

సరోజా నువ్ ఏం అనకు. అయినా గెస్టులుగా వచ్చినవాళ్లతో వంట చేయించడం ఏంటీ. వాళ్లు ఇవాళ ఉండి రేపు వెళ్లిపోతారు.ఇంకెప్పుడు అలా చేయించకు నానమ్మ అని రంగా వెళ్లి పోతూ ఉంటే .. అప్పుడు సరోజ ఆపుతుంది. ప్లేట్ మార్చి రంగాకు చేపల పలుసు వడ్డిస్తుంది సరోజ. వసుధార ఫీల్ అవుతుంటే..అది గమనించిన రంగా వాళ్ళ నానమ్మ వసుధారతో ఇలా వాడు అన్నడాని బాధపడకు. అన్నం తినే విషయంలో వాడు అలాగే ఉంటాడు లే అమ్మా దానికి నువ్ బాధపడకు అని రాధమ్మ చెబుతుంది.తను తీసుకొచ్చిన చేపల పులుసు నీకు నచ్చిందా బాగుందా బావ అని సరోజ రంగాను అడిగితే.. బాగుందని చెప్తాడు.

దాంతో గెలిచాను అన్నట్లుగా సరోజ వసుధారను చూస్తుంది. నువ్ చిన్నగా తిను బావ అని వసుధారను చూస్తూ , రంగా తో ఎవరి కళ్లు అయిన పడి దిష్టి తగులుతుంది బావా అని సరోజ అంటుంది. దాంతో వసుధార ఫీల్ అవుతుంది. తర్వాత మీకు నచ్చనివిధంగా వంట చేసినందుకు సారీ అని వసుధార అంటే.. అందుకు కాదు. మీరు వంట చేసినందుకు నాకు కోపం వచ్చింది. మీరు ఎక్కువ ఆలోచిస్తున్నారు. అవన్నీ పక్కన పెట్టండి. ఇవాళ వంట చేయడం, రేపు ఇంకో పని చేయడం , ఆ తర్వాత మల్లి మరోటి చేయడం అంత కరెక్ట్ కాదు మేడం అని వసుధారతో రంగా అంటాడు.

కొన్నాళ్ల తర్వాత మీరెవరో నేనెవరో అని రంగా వెళ్లిపోతాడు. ఇంకొక వైపు DBST College గురించి MD బాధ్యతల గురించి Meeting జరుగుతుంది. ఎండీ బాధ్యతలు స్వీకరించేందుకు ఇద్దరు బరిలో ఉన్నారు. మను, శైలేంద్ర. మీలో మీరు అందరు మాట్లాడుకొని ,ఒక నిర్ణయం చేసుకుని, ఒకరి పేరు చెప్పండి అని Minister అంటాడు. అందరూ నా పేరే చెబుతారు. నేను కన్న కల నెరవేర్చుకున్నాను అని శైలేంద్ర అనుకుంటాడు. ఒక్కొక్కరు ఒక్కో పేరు చెబుతారు.

తర్వాత ఫణీంద్రను మరింత అడిగితే.. ఆ అర్హత ఎవరికి ఉందో వారికే అప్పజెప్పండి. ఎవరైనా నాకు ఓకే. నేను పూర్తి సహాకరం అందిస్తాను అని ఫణీంద్ర అంటాడు. అదేంటీ డాడ్ నా పేరు చెప్పొచ్చు కదా అని శైలేంద్ర అనుకుంటాడు. మహేంద్రను అడిగితే.. మను పేరు చెబుతాడు. అనుపమను అడిగితే.. ఈ కాలేజీకి శని పట్టుకుంది సార్. అందుకే ఇలాంటి పరిస్థితులు ఎదురు అవుతున్నాయి. నేను ఎవరి పేరు చెప్పలేను. అందరి నిర్ణయమే నా నిర్ణయం అంటుంది.

అందిరి అభిప్రాయాలు సరిగ్గా లేవు. అందుకే ఎవరికీ బాధ్యతలు అప్పజెప్పాలని తేల్చలేం. మీకు వారం టైమ్ ఇస్తున్నాను. మీరందరూ ఆలోచించి ఓ నిర్ణయం తీసుకోండి. లేదంటే ఈ కళాశాలని ని Government తన చేతిలోకి చేసుకుంటుందని Minister గారు చెబుతాడు. అలా కుదరదు సార్. కాలేజీకి రిషీంద్ర భూషణ్ ఫ్యామిలీ నుంచే ఎండీగా వస్తున్నారు. ఇప్పుడున్నవాళ్లలో నేను తప్పా ఇంకెవరు లేరు. నేను చేస్తాను సార్ అని శైలేంద్ర అంటాడు. అంతా షాక్ అవుతారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

Guppedantha Manasu Serial Today Episode

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Instagram Group Follow Me